నిర్గమ 12: ప్రవచనాల్లో పస్కా పండుగ, part 1

Screen Shot 2019-07-06 at 12.51.03 PM.png                                     

బైబిల్ ప్రవచనాలు మనము ధ్యానము చేస్తున్నాము. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. వారు ఫరో చక్రవర్తి క్రింద బానిసత్వములో మ్రగ్గుచూ ఉన్నారు. దేవుడు వారి యొద్దకు మోషేను పంపాడు. మోషే ఫరోని కోరాడు: నా ప్రజలను వెళ్లనివ్వు. అయితే ఫరో తన హృదయాన్ని కఠినము చేసాడు. ఇంకోసారి నాకు కనిపించావంటే నిన్ను చంపేస్తాను అని మోషే కి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించాడు. దేవుడు ఐగుప్తు దేశము మీదకు 10 రకాల తెగుళ్లు పంపించాడు. ఫరో కి తన శక్తి ఏమిటో అర్ధమయ్యేలా 

చేశాడు. తన ప్రజలకు విడుదల అనుగ్రహించాడు. క్రీ.పూ 1446 లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము వదలి, తమ అరణ్య యాత్ర ప్రారంభించారు. ఐగుప్తు దేశము విడిచివెళ్లేముందు ఇశ్రాయేలీయులు పస్కా పండుగ ఆచరించారు. ఇశ్రాయేలీయుల చరిత్రలో, బైబిలు ప్రవచనాల్లో ఈ సంఘటనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భవిష్యత్తులో రాబోయే క్రీస్తు విరోధి ఫరో లాగానే ఉంటాడు. దేవుని ప్రజలను

హింసిస్తాడు. ఐగుప్తు మీదకు గొప్ప తెగుళ్లు పంపినట్లుగానే, క్రీస్తు విరోధి రాజ్యము మీదకు దేవుడు తెగుళ్లు పంపిస్తాడు. ఫరో పట్ల దేవుడు ఎంతో సహనాన్ని చూపించాడు. అతడు మారు మనస్సు పొండుతాడేమో నని ఎదురుచూశాడు. ఫరో తన హృదయాన్ని కఠినము చేసుకొన్నాడు కానీ మారు 

మనస్సు పొందలేదు. అప్పుడు దేవుని శిక్ష అతని మీదకు వచ్చింది. ఈ రోజు కూడా మారుమనస్సు పొందుటకు రక్షణ లేని వారికి సమయము ఇస్తున్నాడు. సమయము వున్నప్పుడే వారు రక్షణ

పొందితే మంచిది. ఫరో కి దేవుని భయము లేదు.రాబోయే క్రీస్తు విరోధికి కూడా దేవుని భయము 

ఉండదు. ఫరో కి దీన మనస్సు లేదు. నేనే దేవుణ్ణి అనుకొన్నాడు.గర్వముతో అరిచాడు: నేను నీ మాట

వినుటకు ఎవడ్రా నీ దేవుడు.గెట్ అవుట్’ అని మోషే గారిని గెంటివేశాడు. అంత్య క్రీస్తు కూడా అంతే. నేనే దేవుణ్ణి అని ఈ ప్రపంచానికి ప్రకటించుకొంటాడు. తనను విమర్శించిన ప్రవక్తలను 

చంపివేస్తాడు. ఫరో మీదకు, ఐగుప్తు మీదకు దేవుడు పంపిన తెగుళ్లు ఒక దాని తరువాత ఒకటి తీవ్ర రూపము దాల్చినాయి. ఏడేండ్ల శ్రమలలో కూడా ఈ ప్రపంచము మీదకు వచ్చే తెగుళ్లు ఒక దాని తరువాత ఒకటి తీవ్రరూపము దాల్చుతాయి. 

    ఫరో దేవుని వాక్యము వింటే బాగుండేది. అతని ప్రవర్తన వలన ఎంత నష్టము జరిగింది? 10 తెగులు వలన ప్రతి ఇంటిలో ప్రథమ సంతానము మృత్యువాత పడ్డారు. దేవుని మాటలో జీవము

ఉంది. సాతాను మాటలో మరణము ఉంది.  ఈ మధ్యలో కబీర్ సింగ్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా నేను చూడలేదు కానీ న్యూస్ పేపర్లో చదివినది చెబుతున్నాను. ఈ సినిమా లో హీరో ఒక డాక్టర్. విచ్చలవిడిగా బ్రతుకుతాడు. త్రాగుతాడు, డ్రగ్స్ వాడుతాడు. మద్యము త్రాగి హాస్పిటల్ కి వెళ్తాడు, ఆపరేషన్ లు చేస్తాడు, కోపమొస్తే బూతులు తిడతాడు, కొడతాడు. ఇలాంటి క్యారెక్టర్ లను 

హీరోలుగా చూపిస్తున్నారు. ఈ సినిమాలు ఇప్పుడు వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో ఒక రోజుల్లో గొప్ప దర్శకులు ఉండేవారు. 1956 లో సెసిల్ బి డెమిల్ టెన్ కమాండ్మెంట్స్

చిత్రం తీశాడు. ఈజిప్ట్ వెళ్లి అక్కడ పిరమిడ్ల మీదకు ఎక్కి ఎంతో శ్రమ తీసుకొని ఆ చిత్రం నిర్మించాడు.ప్రపంచ వ్యాప్తముగా ఎన్నో వందల కోట్ల మంది ఆ సినిమా చూశారు.ఎంత గొప్ప దేవుడు అనుకొన్నారు. ఐగుప్తు దేశము నకు తన మహా శక్తిని చూపించి, ఫరో రాజు నుండి ఇశ్రాయేలీయులను విడిపించి మోషే లాంటి గొప్ప నాయకుణ్ణి తయారు చేసి, అరణ్యములో తన ప్రజలకు పది ఆజ్ఞలతో ధర్మశాస్త్రము ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు ఈయన అనుకొన్నారు. ఒక రోజుల్లో హాలీవుడ్ అలా ఉండేది. వారు దేవునికి దూరముగా వెళ్ళిపోయిన తరువాత డ్రగ్స్ వాడే హీరోలను తయారు చేశారు. అదే సంస్కృతి ఇప్పుడు బాలీవుడ్ లో, టాలీవుడ్ లో మనము చూస్తున్నాము.

    ఒక రోజుల్లో హీరో ఒక అమ్మాయినే ప్రేమించేవాడు.ఇప్పుడు కట్టుబాట్లు లేకుండా, విచ్చలవిడిగా తిరగటం ఫాషన్ గా చూపిస్తున్నారు. ఒక రోజుల్లో హీరో బూతులు తిట్టేవాడు కాదు.ఇప్పుడు హీరో బూతులు తిట్టడం ఫ్యాషన్ గా మారింది. ఒక రోజుల్లో హీరో తల్లిదండ్రులను గౌరవించేవాడు.ఇప్పుడు హీరో తల్లి దండ్రుల మీద జోకులు వేసి వారిని అపహాస్యము చేయటం ఫ్యాషన్ గా చూపిస్తున్నారు.

ఒక రోజుల్లో హీరో డ్రగ్స్ వాడేవాడు కాదు. విలన్ మాత్రమే డ్రగ్స్ అమ్మేవాడు. ఆ విలన్ పట్టుకొని పోలీసులకు అప్పజెప్పేవాడు. ఇప్పుడు హీరో డ్రగ్స్ తీసుకొని, గడ్డం పెంచుకొని, కుక్క పిల్లను తీసుకొని రోడ్డు మీద తిరగడం ఫ్యాషన్ గా చూపిస్తున్నారు. దేవుడు లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ లే హీరోలుగా తయారవుతారు. మోషే లో ఒక నిజమైన హీరో ని మనము చూస్తున్నాము. ఐగుప్తులో పాప భోగాలు ఉన్నాయి. మోషే వాటిని కోరుకోలేదు, నాకు క్రీస్తు కావాలి, నాకు యేసు క్రీస్తు కావాలి, ఆయన

రక్షణ కావాలి, ఆయన వాక్యము కావాలి, నాకు అంతఃపురము అక్కరలేదు, క్రీస్తు కోసము అరణ్యము అయినా సరే వెళ్తాను అని బయలుదేరాడు.

 

     యెషయా గ్రంథము లో అనేక ప్రవచనాలు మనము చూస్తాము. దేవుడు పదే పదే నిర్గమ కాండము వారికి గుర్తు చేశాడు. (యెషయా 11:15; 43:14-21; 51:9-11). ఐగుప్తు లో నుండి నా 

ప్రజలను ఏవిధముగా పూర్వము విడిపించానో, అదే విధముగా రాబోయే రోజుల్లో నా ప్రజలను 

విడిపిస్తాను.  యెషయా గ్రంథము 51 అధ్యాయములో కొన్ని మాటలు చూద్దాము: 

  1. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము 

పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము

  1. అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు

 నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు 

సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా?

  1. యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు 

తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు 

సంతోషానందము గలవారగుదురు. 

    యెషయా  ప్రవక్త  ఏమంటున్నాడంటే, దేవుడు మీకు రక్షణ ఇవ్వబోతున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు? అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడు.  తన ప్రజల కోసము సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడు. నేను చాలా సముద్రాలు చూశాను. అవి చాలా లోతుగా ఉంటాయి. అలాంటి సముద్రాన్ని చీల్చి తన ప్రజలను రక్షించిన దేవుడు ఈయన. 

యెషయా గ్రంథము 11:16 కూడా చూద్దాము.

  1. కావున ఐగుప్తుదేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున

వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు 

ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును

  1. And there shall be a highway for the remnant of His people 

     ఐగుప్తు నుండి సముద్రములో, అరణ్యములో దారి వేసిన దేవుడు ఇప్పుడు తన ప్రజల ముందు ఒక రాజ మార్గము వేశాడు. ఒక హై వే వేశాడు. కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ లో పెట్టింది. ప్రతి రోజు 20 కి మీ హై వే వేద్దాము అని లక్ష్యముగా పెట్టుకొంది. హై వే లు ముఖ్యము. యెషయా గ్రంథము లో ఈ హై వే అనే మాట అనేక చోట్ల మనము చూస్తాము. రాజ మార్గము. ప్రభువైన యేసు క్రీస్తు ఈ రాజ 

మార్గమును వేశాడు. ఆయన ఈ హై వే ని నిర్మించాడు. ఈ రాజ మార్గము ఆయన ఎలా వేశాడు? ఇంతకు ముందు మనము యెషయా చెప్పిన మాటలు చూశాము. 

విమోచింపబడినవారు

దాటిపోవునట్లు సముద్రాగాధ

స్థలములను త్రోవగా చేసినవాడు. 

    ఆ రాజ మార్గము మీదకు మీరు వెళ్లాలంటే మీరు విమోచించబడాలి. దేవుడు ఆ ఏర్పాట్లు కూడా చేశాడు. మోషేని పిలిచాడు. మీరు పస్కా పండుగ ఆచరించండి. పస్కా బలి గా గొఱ్ఱెపిల్ల ను అర్పించండి. ఆ గొఱ్ఱెపిల్ల రక్తాన్ని మీ ఇంటి ద్వారబంధముల మీద పూయండి. పస్కా గొఱ్ఱెపిల్ల బైబిలు ప్రవచనాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగింది.

    ఆదికాండము 22 అధ్యాయములో మనము అబ్రహాము, అతని కుమారుడు ఇస్సాకులను చూస్తాము. ఆ మోరియా పర్వతము మీద ఇస్సాకు అబ్రహామును అడిగాడు: నా తండ్రీ, నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహనబలికి గొఱ్ఱపిల్ల ఏది? అబ్రహాము యేమని చెప్పాడు? నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱపిల్లను చూచుకొనును. దేవుడు చేసిన గొప్ప కార్యము అదే. మన కోసము ఒక పస్కా గొఱ్ఱెపిల్లను ఆయన సిద్ధము చేశాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు బాప్తిస్మ మిచ్చే  యోహాను ఆయనను చూపించి: 

ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.

     ఈ గొఱ్ఱెపిల్ల ఒక్క ఇశ్రాయేలీయుల పాపములు మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరి పాపములు 

సిలువ మీద మోసింది. 

     అపొస్తలుల కార్యములు 8 అధ్యాయములో మనము ఒక నపుంసకుని గురించి చదువుతాము. 

ఈ నపుంసకుడు ఇథియోపియా దేశానికి చెందిన వాడు. ఒక రథములో యెరూషలేము వెళ్తున్నాడు. యెషయా గ్రంథము 53 అధ్యాయము చదువుతున్నాడు. 

ఆయన గొఱ్ఱవలె వధకు తేబడెను 

బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱపిల్ల

ఏలాగు మౌనముగా ఉండునో 

ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.

     ఆ మాటలు ఆ నపుంసకునికి అర్ధము కాలేదు. గొఱ్ఱవలె వధకు తేబడింది ఎవరు? గొఱ్ఱపిల్ల వలె  మౌనముగా ఉంది ఎవరు? ఆ సమయములో ఫిలిప్పు ఆ వీధిలో ఉన్నాడు. ఆయన ఆ రథము వద్దకు పరుగెత్తుకొంటూ వెళ్ళాడు. ‘మీరు చదివేది మీకు అర్ధము అవుతుందా?’ అని అడిగాడు. ఎవరన్నా నాకు వివరించకపోతే ఎలా అర్ధం అవుతుంది? అని నపుంసకుడు ప్రత్యుత్తరము ఇచ్చాడు. ఫిలిప్పును తన రథము మీదకు ఆహ్వానించాడు. ఫిలిప్పు యెషయా ప్రవక్త వ్రాసిన మాటలు నపుంసకునికి వివరించాడు. యెషయా ప్రవచించిన ఈ గొఱ్ఱె పిల్ల ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. 

నపుంసకుడు ఆ సత్యము తెలుసుకొని తన రథము ఆపించి బాప్తిస్మము పొందాడు. 

     తార్సు వాడైన సౌలు క్రైస్తవ్యమును రూపు మాపవలెనని కంకణము కట్టుకున్నాడు. దమస్కు వెళ్ళుతూ మార్గమధ్యములో సజీవుడైన యేసు ప్రభువు ను చూశాడు. తన తప్పు తెలుసుకొన్నాడు. ఎవరీ యేసు క్రీస్తు అని పాత నిబంధన మొత్తము ధ్యానము చేశాడు. ప్రవక్తలందరూ చెప్పింది ఈ యేసు క్రీస్తు గురించే అని గ్రహించాడు. 1 కొరింథీ పత్రికలో వ్రాశాడు. 

క్రీస్తు అను మన పస్కా పశువు

వధింపబడెను

(1 కొరింథీ 5:7) 

    ధర్మశాస్త్రాన్ని ఎంతో క్షుణ్ణముగా పాటిస్తున్న ఈ పరిసయ్యుడు దాని ద్వారా దేవుని నీతిని పొందలేము అని గ్రహించాడు. వధింపబడిన క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన రక్తము ద్వారా కడుగబడాలి అని గ్రహించాడు. ఈ గొఱ్ఱెపిల్ల రక్తము ఎలాంటిది? మొదటి పేతురు పత్రికలో

మనం చదువుతాము.

  1. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా

వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు 

విమోచింపబడలేదుగాని 

  1. అమూల్యమైన రక్తముచేత, 

అనగా నిర్దోషమును నిష్కళంకమునగు

గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా 

                                                                       1 పేతురు 1:18-20 

    పేతురు స్వాతంత్రము కోరుకున్నాడు. ఆ రోజుల్లో యూదులు రోమన్ల క్రింద బానిసలుగా ఉన్నారు. యేసు ప్రభువుకు అడ్డుపడ్డాడు. సిలువ నీకు వద్దు, ఈ రోమన్ల నుండి మమ్ములను విడిపించు 

చాలు, సీజర్ పాలన నుండి మమ్ములను విడిపించు చాలు అన్నాడు. యేసు క్రీస్తు సిలువను ఎందుకు 

కోరుకొంటున్నాడో పేతురుకు చాలా కాలము అర్ధము కాలేదు. యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడి 

మరణించి, తిరిగి లేచిన తరువాత ఈ సత్యము పేతురుకు అర్ధము అయ్యింది. రాజకీయ స్వాతంత్రము కన్నా ముఖ్యమైనది, సామాజిక స్వాతంత్రము కన్నా ముఖ్యమైనది ఆత్మీయ 

స్వాతంత్రము. ఆ స్వాతంత్రము పొందాలంటే ఈ పస్కా గొఱ్ఱె పిల్ల దగ్గరకు రావాలి. ఆయన యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము చేత విమోచించబడాలి. 

    క్రీ పూ 1446 లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి స్వాతంత్రము పొందారు. అయితే దేవుడు వారితో ఏమన్నాడు? అది ఒక్కటే మీకు చాలదు. మీరు గొఱ్ఱె పిల్ల రక్తము చేత విమోచించబడాలి. అదే మీకు నిజమైన స్వాతంత్రము. పస్కా పండుగను ఇశ్రాయేలీయులు అప్పుడు 

ఆచరించారు. అప్పటి నుండి వారు ప్రతి సంవత్సరము వారు ఆ పండుగను ఆచరించారు. అది వారికి ఇండిపెండెన్స్ డే లాంటిది. పస్కా గొఱ్ఱె పిల్ల యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి మీరు కూడా ఆయన రక్తము చేత మీ పాపములు కడుగబడి విమోచించబడాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.

Feed a Hungry Child with as little as $10 per month

Give a helping hand to feed the hungry children and to provide them health care and education

$10.00

Leave a Reply